కేసులకు భయపడి విశాఖ స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపడంలేదు: లోకేశ్


కేసులకు భయపడి సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపడంలేదు అని నారా లోకేశ్ అన్నారు. గాజువాకలోని యువగళం పాదయాత్రలో ఆయనకు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఐక్యవేదిక సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందించారు. లోకేశ్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి జగన్ రెడ్డి కమిషన్ల కోసం, ప్లాంట్ లో వాటాల కోసం ఆరాటపడడం అత్యంత దుర్మార్గం అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోమని అన్నారు.