అలాంటివాళ్లను చూస్తే నాకు అసహ్యం: త్రిష


 తమిళనాట రెండు వేర్వేరు రాజకీయ పార్టీ నేతల మధ్య వివాదం హీరోయిన్‌ త్రిష మెడకు చుట్టుకుంది. ఈ వివాదంలో ఆమె వ్యక్తిగత జీవితం పైన కామెట్లు చేశారు. దీనిపై 'ఎక్స్‌' వేదికగా త్రిష తీవ్రంగా స్పందించింది. ‘అటెన్షన్‌ కోసం తాపత్రయపడే దిగజారుడు మనస్తత్వం గల వాళ్లను చూస్తే నాకు అసహ్యం. ఇక వారిని క్షమించను.. ఇకపై నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే సమాధానం వస్తుంది.’ అంటూ రాసుకొచ్చింది.