వైసీపీలో చేరిన జనసేన నేత రామ్ సుధీర్


జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్, సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రామ్ సుధీర్ తో పాటు జనసేన స్థానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్లు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.