జనసేన పార్టీతోనే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుందని అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టి బత్తుల రాజబాబు అన్నారు. సోమవారం అమలాపురం రూరల్ మండలం పేరూరులో 71 రోజు జనసేన ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.