హైదరాబాద్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ న్యూ షెడ్యూల్‌ షురూ


 రామ్‌చరణ్‌ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కాగా తాజాగా గురువారం నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను షురూ చేశారు. త్వరలోనే ఈ షెడ్యూల్ లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని తెలుస్తోంది.